Dil Raju: వైరల్ అవుతున్న నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన శాకుంతలం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ విడుదల కాగా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది. ఈ సినిమా నిర్మాతలకు కట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే అంచనాలను సినిమా చేరుకోలేకపోయింది.శుక్రవారం మొదటి షో నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన కెరియర్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.

 

శాకుంతలం సినిమా పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం అయితే నా 25 ఏళ్ల సినీ కెరియర్ లో ఈ సినిమా నాకు పెద్ద జర్క్ అంటూ కామెంట్స్ చేశారు.నేను మొదటి రోజు ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమాను చూస్తాను అక్కడ వచ్చిన ఆదరణ బట్టి ఆ సినిమా హిట్ ఆ ఫ్లాపా అని అర్థం చేసుకుంటాను. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్ రాలేదు అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు.ఇలా సినిమా ఫ్లాప్ అయితే శుక్రవారం సాయంత్రానికి ఆ సినిమా గురించి ఆలోచించడం మానేసి శనివారం మరొక కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని తెలిపారు.

 

ఇక తమిళ రీమేక్ 96 సినిమా విషయంలో తన అంచనాలు తప్పయ్యాయని ఈయన తెలిపారు.ఆ సినిమా అల్లు అర్జున్ నాని వంటి హీరోలకు చూపిస్తే బాగుందని చెప్పారు అయితే అప్పుడే కరోనా రావడంతో ఓటీటీలో చాలామంది ఈ సినిమాని చూశారు. ఆ తర్వాత జాను సినిమా విడుదలైంది. 96 చూసిన తర్వాత జాను సినిమాని ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు.జెర్సీ జాను సినిమాల ద్వారా నాకర్థమైనది ఏంటంటే ఓటీటీలో విడుదలైన సినిమాలను రీమేక్ చేయకూడదంటూ ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -