Tirupati: భర్తపై మూత్రం పోసి గుండు కొట్టించిన భార్య.. ఎక్కడంటే?

Tirupati: దేశవ్యాప్తంగా రోజురోజుకి వివాహేతర సంబంధాల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. వివాహేతర సంబంధాల మోజులో పడి స్త్రీలు పురుషులు పచ్చని సంసారాలు నాశనం చేసుకోవడంతో పాటు నిత్యం ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి చంపడానికి చావడానికి అయిన వెనకాడడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తకు దారుణమైన అవమానం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన తిరుపతిలోని చంద్రగిరిలో చోటు చేసుకుంది.

రంగం పేటకు చెందిన వంశీ అనే ఆటో డ్రైవర్ అన్వర్ అనే ఫైనాన్షియర్ దగ్గర ఆటో తీసుకుని నడిపేవాడు. ఈ లావాదేవీల నేపథ్యంలో వంశీ భార్యకు అన్వర్‌ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త వంశీకి తెలియడంతో భార్యను తిట్టి బెంగళూరుకు ఉపాధి కోసం వెళ్లిపోయాడు. పలుమార్లు భార్యకు హెచ్చరించినా అన్వర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో వంశీ బాధపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అన్వర్‌ను తిడుతూ, అతడికి వ్యతిరేకంగా ఆర్ఐపి(RIP)అంటూ పోస్టులు పెట్టాడు. అది చూసిన అన్వర్ తిరిగి వంశీపై కక్ష పెట్టుకున్నాడు.

 

తన స్నేహితుడి హర్ష సహకారంతో వంశీని బెంగళూరు నుండి కిడ్నాప్ చేయించి చంద్రగిరికి తీసుకువచ్చాడు అన్వర్. ఆ తర్వాత వంశీని దారుణంగా విచక్షణ రహితంగా కొట్టాడు. అనంతరం వంశీ తలపై మూత్రం పోసి గుండు కొట్టించాడు. అలా దాదాపు పది రోజులపాటు అతన్ని హింసించాడు. అనంతరం వంశీతో అన్వర్ తనకు క్షమాపణలు చెప్పించుకుని ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అన్వర్ కానిస్టేబుల్ అండదండలతో మరింత రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. వెంటనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -