పురుషులకు కుడి కన్ను.. స్త్రీలకు ఎడమ కన్ను ఎందుకు అదురుతాయో తెలుసా?

చాలా మంది శాస్త్రలను ఎక్కువగా నమ్ముతారు. సా«ధారణంగా మనం బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే కాస్త కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్లమని పెద్దలు అంటారు. అంటే తుమ్ము రాబోయే ప్రమాదాన్ని చెబుతుందా.. ఏదైనా చెడు జరిగితే మనకు ఈ రోజూ ఎవరో ఎదురొచ్చారు అని గుర్తు చేసుకుంటాం. కొందరు కాకి తలమీద తన్నితే అది శని వాహనం కనుక మనకు శని పడుతుందని యముడి రూపంలో మరణం వస్తుందని భయపడతారు. కొందరు బల్లి మీద పడితే శకునం అని భావిస్తారు. ఇలాంటి మూఢ నమ్మకాలు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉంటాయి. జపాన్‌ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించదని భావిస్తుండగా ఇండోనేషియాలో 9 అంకెను దురదృష్టంగా భావిస్తారు.

కుడి కన్ను అదిరితే మంచిది.. ఎడమ కన్ను అదిరితే అరిష్టం అనే మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. వాస్తుశాస్త్రం ఎలా ఉందో శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం కేవలం కన్నే కాదు. పురుషులకు కుడి వైపు శరీర భాగం, స్త్రీలకు ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుంచి∙కొన్ని మంచిని పెంచితే కొన్ని శాస్త్రీయంగా నిరూపితం కానివి కూడా ఉన్నాయి. అయితే కన్ను అదరడం వెనుక కూడా రామాయణానికి సంబంధించి ఒక బలమైన కథ ఉంది. శ్రీరాముడు వానర సేనను తీసుకుని రావణుడి మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు లంకలో ఉన్న రావణాసురిడికి, సీతమ్మకు ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట. ఆ తరువాత రాముడు సీతను రావణాసురిడి చెర నుండి విడిపించాడు.

ఈ ఫలితం ముందుగానే శుభసూచకంగా సీతమ్మకు తెలిపింది. ఆ సమయంలో రావణాసురిడికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కీడు జరిగింది. ఇదే కన్ను అదిరే వెనుక ఉన్న అసలు నిజం. ఆ రోజు నుండి స్త్రీలకు ఎడమ కన్ను, పురుషులకు కుడి కన్ను అదిరితే మంచి శకునంగా భావిస్తారు. ఇక కంటి సంబంధిత సమస్యలు ఉన్నా కూడా కళ్లు తరచూ అదురుతాయి. అలాంటప్పుడు వైద్యున్ని సంప్రదించాలి కానీ కన్ను అదురుతుంది కదా మంచి జరుగుతుందని కూర్చోకూడదు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -