NTR: వార్నింగ్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అంత కోపమా?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియన్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తీసుకునే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అతను ఎన్టీఆర్ 30 మూవీ కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతుంది.

 

ఈ క్రమంలో సినిమా లేట్ షెడ్యూల్ విషయంపై ఎన్టీఆర్ కొరటాల శివ పై సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. తన విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని ఫీలైన ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర కొరటాల గురించి సీరియస్ కామెంట్స్ చేశారు అని సమాచారం. ఇటు ఫాన్స్ కూడా ఎన్టీఆర్ మూవీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఎన్టీఆర్ సినీ కెరియర్ ను జనతా గ్యారేజ్ ఓ మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. మరి తిరిగి ఆ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.,

 

ఇటు కొరటాలు చేసిన రీసెంట్ మూవీ ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మెగాస్టార్ మరియు రామ్ చరణ్ వంటి పవర్ఫుల్ హీరోస్ తో చేసినప్పటికీ చిత్రం ఊహించిన రేంజ్ లో ముందుకు పోలేదు. కాబట్టి కొరటాలు కూడా తన నెక్స్ట్ మూవీ పై చాలా హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కైనా తారక్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తుంది అని ఆశతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.

 

ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకులలో ఉత్కంఠతను నెలకొల్పింది. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలైలో స్టార్ట్ అవ్వాల్సినట్లు ఉన్నప్పటికీ క్రమంగా అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తన సన్నిహితుల దగ్గర ఎన్టీఆర్ ఈ మూవీ కోసం తన టైమ్ అంతా వృధా అవుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారట.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -