Panipat: హర్యానా రాష్ట్రంలోని పానీపత్ లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్న ప్రియురాలు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఐదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ దారుణంలో తాజాగా ప్రియురాలికి శిక్ష పడింది. నిందితురాలు జ్యోతి, కృష్ణ కాలేజీలో చదివే రోజుల నుంచే ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి జ్యోతి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దాంతో లవర్స్ ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఒకవేళ ఇంటి నుంచి పారిపోయిన కూడా కుటుంబ సభ్యులు వదలరు.
మళ్లీ వెనక్కి పిలుచుకొని వచ్చి మమ్మల్ని విడగొడతారు అని భావించిన జ్యోతి. అందుకోసం ఏకంగా మాస్టర్ ప్లాన్ వేశావేసింది. ఈ క్రమంలో తాను ఇంట్లో నుంచి వెళ్లినా సరే ఇంట్లోని వారికీ అనుమానం రాకుండా ఉండటం కోసం జ్యోతి లాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని ప్రేమికులిద్దరూ నిర్ణయించుకున్నారు. ఓ టీవీ సీరియల్ ఆధారంగా ఈ పథకం రచించారు. అనుకున్న ప్రకారం 2017 సెప్టెంబర్ 5న జ్యోతి తన స్నేహితురాలు సిమ్రన్ను జీటీ రోడ్డుకు పిలిపించింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత జ్యోతి తన స్నేహితురాలు సిమ్రన్ చేత మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగించి,స్పృహ కోల్పోయిన తరువాత జ్యోతి, ఆమె లవర్ ఇద్దరూ కలిసి సిమ్రన్ గొంతు కోసి చంపేశారు.
ఆ తర్వాత మృతురాలి దుస్తులు మార్చి, ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి ప్రేమికులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. ఇక అక్కడ ఉన్న జ్యోతి బట్టలు కనిపించడంతో పోలీసులు జ్యోతిదే మృతదేహం అని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. మరోవైపు సిమ్రన్ కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిమ్రన్ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు జ్యోతిగా భావించిన యువతి డెబ్ బాడీకి సంబంధించిన ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. ఈ క్రమంలో డెడ్ బాడీ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా అది సిమ్రన్ అని గుర్తించారు. అలా ఎట్టకేలకు అసలు నేరస్థురాలు జ్యోతి అని బయటపడింది.