Theater: ఆ సినిమా థియేటర్ లో టికెట్ రేటు రూపాయి మాత్రమే.. కానీ?

Theater: ఇప్పుడు ఓటీటీల ప్రభావం వల్ల చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం లేదు. కానీ థియేటర్ కు వెళ్లాలంటే కచ్చితంగా జేబులో ఐదు వందలో లేకుంటే వెయ్యి రూపాయలో ఉండాల్సిందే. తక్కువలో తక్కువ అనుకున్నా కూడా ఓ రెండు వందల రూపాయలు ఉండాలి. ఒక వేళ ఫ్యామిలీతో సినిమా చూసేందుకు వెళ్తే కచ్చితంగా వెయ్యి నుంచి రూ.2 వేల వరకూ ఉండాలి. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే..ఇక్కడొక థియేటర్ లో కేవలం రూపాయికే సినిమా చూడొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మీరు నమ్మి తీరాల్సిందే.

 

హైదరాబాద్ లోని ఓ థియేటర్ సినిమా చూసే వారి కోసం బంపరాఫర్ ను ప్రకటించింది. కేవలం రూపాయికే టికెట్ ఇస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఆ థియేటర్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ఈ బంపరాఫర్ ను ప్రకటించింది. మౌలాలిలోని మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరుతో ఓ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభం కానుంది. ఈ మల్టిప్లెక్స్ ను డిసెంబర్ 15వ తేదిన ప్రారంభించనున్నారు.

 

ఏఎంఆర్ మూవీ మ్యాక్స్ పేరుతో ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్ సినీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ను అందించింది. థియేటర్ ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 15 తేదిన మాత్రమే ఈ మల్టీప్లెక్స్ లో ఏ సినిమా చూసినా రూపాయికే టికెట్ దొరుకుతుంది. మూవీ మ్యాక్స్ మొత్తం 11 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. తెలుగు, హిందీ సినిమాలు ఆడనున్నాయి.

 

ఆన్ లైన్ లో కూడా ఈ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, బుక్ మై షోల్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రూపాయికే టికెట్ దొరకడంతో అప్పుడే అందరూ తమ టికెట్లను బుక్ చేసుకునేశారు. యశోద, మసూద, లవ్ టుడే, గుర్తుందా శీతాకాలం, చెప్పాలని ఉంది, హిట్-2, పంచతంత్రం, ఊంచాయి, కాంతార, దృశ్యం2, భేడియా వంటి సినిమాలు మూవీ మ్యాక్స్ లో ప్రదర్శించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -