Top Smartphones: ఈ ఏడాది ఎక్కువ శాతం యూజర్లను ఆకట్టుకున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే?

Top Smartphones: సాధారణంగా ప్రతి ఏడాది మార్కెట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతూనే ఉంటుంది. అలా ఈ ఏడాది అనగా 2022లో కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల హవా బాగానే నడిచిందని చెప్పవచ్చు. ఈ ఏడాది విడుదలైన ఎన్నో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ ఏడాది యూజర్లను ఆకట్టుకున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ కి భారీగా క్రేజ్ లభించింది. కాగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ని మొత్తం 4 వేరియంట్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌ 14, ఐఫోన్ 14 ప్లస్‌,ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ఇలా నాలుగు వేరియంట్ లలో ఈ ఫోన్ ని విడుదల చేశారు.

 

భారత్ లో ఈ ఫోన్‌ ధర ప్రారంభ రూ. 79,900 కాగా హై ఎండ్ వేరియంట్ ధర రూ. 1,39,900గా ఉంది. ఏడాది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో నిలిచిన వాటిలో గూగుల్ పిక్సెల్ 7 కూడా ఒకటి. ఈ గూగుల్ పిక్సెల్‌ 7 ఫోన్ ను పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను విడుదల చేశారు. ఇక పిక్సెల్‌ 7లో 6.3 అంగుళాలు, పిక్సెల్‌ 7ప్రోలో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే దీని ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది. అలాగే ఏడాది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైపోయిన ఫోన్ లలో శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ సిరీస్‌ కూడా ఒకటి. ఈ శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ సిరీస్‌ ను గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 పేరుతో ఫోల్డబుల్‌ ఫోన్‌లను తీసుకొచ్చింది.

 

దీని ధర విషయానికి వస్తే రూ. 1,42,000గా ఉంది. అలాగే ఈ ఏడాది వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించిన ఫోన్లలో నథింగ్ ఫోన్ వన్ కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది. షావోమి 12ఎస్‌ ప్రో ఫోన్ లు కూడా ఏడాది ఎక్కువగా అమ్ముడయ్యాయి. 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 6.73 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ధర విషయానికొస్తే రూ. 59,999గా ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -