Calculating Money: ప్రస్తుత కాలంలో డబ్బుంటేనే మనిషికి విలువనిస్తున్నారు. రాత్రింబవళ్లు, ఆర్ధాకాలితో కష్టపడి సంపాదించే డబ్బులను చిన్న చిన్నర పొరపాట్లతో పోగొట్టుకుంటే ఆ క్షోభ భరించేలేది. మానవుడు పుట్టుక నుంచి చావు వరకు అన్నింటిని నడిపించేది ధనమే. డబ్బు లేకపోతే నేటి సమాజంలో మనిషి మనుగడ అసాధ్యం. అందుకే ధనమ్ మూలం ఇదమ్ జగత్ అని అంటుంటారు. డబ్బే మనిషిని, నేటి సమాజాన్ని నడిపిస్తున్నదని అందరికీ తెలుసు.
మనిషి తన జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యం, మనశ్శాంతి ఇలా ఏది కావాలని అనుకున్నా అందుకు డబ్బే మూలం అవుతుంది. ఈ తత్వం బోధపడిన వారు సమయాన్ని క్షణం కూడా వృథా చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలని అహర్నిశలు శ్రమిస్తుంటారు.అయితే, డబ్బులు ఈరోజుల్లో అందరు సంపాదిస్తారు. కానీ సంపాదించిన డబ్బులు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోకపోతే ఎంత సంపాదించినా నీటి పాలవుతోందని పెద్దలు చెబుతున్నారు.
లక్ష్మీ దేవి సంపద, శ్రేయస్సు దేవతగా కొలుస్తుంటారు. ఈ దేవత ఆశీర్వాదం పొందిన ఇల్లు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తుంటుంది.అదే లక్ష్మీ దేవికి ఆగ్రహం వచ్చే పనులు చేస్తే ఇంట్లో దారిద్య్రం తాండవిస్తుందట.. చిన్న చిన్న పొరపాట్లతో తెలిసి తెలియక చేసే తప్పులే లక్ష్మిదేవి కోపానికి దారి తీస్తాయని కొందరు చెబుతున్నారు.
సాధారణంగా డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము అంటించి లెక్కిస్తారు. అలా అంటిస్తే ధనలక్ష్మికి కోసం వచ్చి ఆర్థిక కష్టాలకు దారితీస్తుందట. నోట్లకు ఉమ్మి అంటించడం ఆరోగ్యపరమైన కూడా తప్పు. ఇది లక్ష్మికి అవమానకరం.ఉమ్మి బదులు తడి వాడటం మంచిదట. మరికొందరు నాణేలను బొమ్మలాగా విసురుతుంటారు. ఇలా ఎప్పడు చేయకూడదట. నోట్లు, నాణేలను విసరకూడదు. ఇలా చేయడం లక్ష్మిని అవమానించడమే అవుతుంది. ఇక డబ్బును ఇంట్లో దాచే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ డబ్బులు పెట్టరాదు. చాలా శుభ్రమైన ప్రాంతంలోలనే దాచుకోవాలి. నడితే చోట డబ్బులు పెట్టరాదు. అందుకు సంపాదించిన డబ్బులను చాలా జాగ్రత్తగా వాడితే అంత మంచి జరుగుతోందని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నారు.