YCP MLAs: ఈ ఎమ్మెల్యేలే వైసీపీలో టాప్.. మరెవరూ సాటిలేరుగా!

YCP MLAs: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని ఈనెల 29 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు,సమన్వయ కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, వాలంటరీలు, మహిళలు, గృహసారతులు ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నారు. గడపగడపకి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ మంచి ఫీడ్ బ్యాక్ ను తెలుసుకుంటున్నారు.

అంతేకాకుండా ప్రజలకు గత టిడిపి ప్రభుత్వ పాలన గురించి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలన గురించి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలియజేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వారిలో ఏపీలో ఐదుగురు ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటి స్థానంలో ఉన్నది చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు. రెండవ స్థానంలో అమలాపురం ఎమ్మెల్యే మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు.

ఇక మూడవ స్థానంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి ఉన్నారు. అలాగే నాలుగవ స్థానంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. చివరగా ఐదవ స్థానంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ వైసీపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున అవగాహన చేస్తున్నప్పటికీ ఈ ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉన్నట్టుగా తెలిపింది వైసిపి ప్రభుత్వం.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -