Chiranjeevi-Rajasekhar: చిరంజీవి వదులుకుని రాజశేఖర్ నటించిన సినిమా ఇదే!

Chiranjeevi-Rajasekhar: సినిమా ఇండస్ట్రీలో చాలాసార్లు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వస్తుంటుంది. అలాగే ఒకరు ఎంతో ఆశపడ్డ కథను.. వేరే వారు పొంది ఉంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిగి ఉంటే మాత్రం అనుకున్న కథలతో, హీరోలు సినిమాలు చేస్తుంటారు. అలాంటి అదృష్టం రాజశేఖర్ ని ఓసారి వరించింది.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు ఊపేసిన రాజశేఖర్ కు తమిళంలో వచ్చిన ఓ సినిమా మీద బాగా ఆసక్తి ఉండేదట. దాంతో ఆ సినిమా చేద్దామనుకునే లోపే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనేశాడట. తమిళంలో వచ్చి భారీ హిట్ అయిన ‘ఒరు సీబీఐ డైరీ కురిప్పు’ సినిమా విషయంలో చిరంజీవి చేసిన మేలును రాజశేఖర్ స్వయంగా చెప్పుకొచ్చాడు.

 

రాజశేఖర్ చేయాలని ఆశపడ్డ ప్రాజెక్టు రైట్స్ ని కొన్న అల్లు అరవింద్.. ఓ సందర్భంలో రాజశేఖర్ కలిస్తే.. సినిమా చేస్తావా? అని అడిగాడట. దాంతో వెంటనే షాక్ అయిపోయిన రాజశేఖర్ మరో మాట మాట్లాడకుండా.. వెంటనే ఓకే చెప్పేశాడట. అయితే దీని గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మీరు రైట్స్ కొన్నారని తెలియగానే చిరంజీవి గారితోనే సినిమా తీస్తారని అనుకున్నా. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని చెప్పుకొచ్చాడట.

 

అయితే ఈ మొత్తం వ్యవహారం మీద అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ‘ముందు చిరంజీవితోనే తీద్దామనుకున్నాం. కానీ ఆయనకి కాల్షీట్ల సమస్య. ఏం చేద్దాం? అని ఆలోచిస్తుంటే చిరంజీవే స్వయంగా మీ పేరు సజెక్ట్ చేశారు’ అని అరవింద్ చెప్పాడట. ఇలా తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘న్యాయం కోసం’ పేరుతో ఆ తమిళ సినిమా తెలుగులో రీమేక్ కాగా.. అది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -