Rajini Mohan Babu: రజనీని తిడుతున్నా మోహన్ బాబులో చలనం లేకపోవడానికి రీజన్ ఇదే!

Rajini Mohan Babu: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా విజయవాడలో జరిగినటువంటి బహిరంగ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఆయన నుంచి రజినీకాంత్ నేర్చుకున్నటువంటి మంచి లక్షణాలు గురించి తెలిపారు. ఇక రజనీకాంత్ ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు బాలకృష్ణ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ వారిని పొగిడారు.

ఇలా రజనీకాంత్ చంద్రబాబు నాయుడుని పొగడమే తప్పు అయింది.దీనినే టార్గెట్ చేస్తూ వైసిపి నాయకులు సంకెళ్లు తెంచుకొని మరి రజనీకాంత్ వ్యక్తిత్వం పై ఆయన కుటుంబం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.ఇక రజనీకాంత్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ గురించి జగన్ అధికారం గురించి ఆయన పాలన గురించి ఎక్కడ నోరు ఎత్తలేదు. ఇలా జగన్ గురించి మాట్లాడకపోయినా చంద్రబాబును పొగడటంతో వైసిపి నాయకులు నోరు పారేసుకుంటున్నారు.

 

వైసిపి నాయకులు ఒక్కొక్కరిగా మీడియా సమావేశంలో పాల్గొంటు రజనీకాంత్ పై ఇస్టాను సారంగా మాట్లాడుతూ తనని మానసిక సంక్షోభానికి గురి చేస్తున్నారు. అయితే రజనీకాంత్ గురించి వైసిపి నాయకులు ఇలా మాట్లాడుతున్నప్పుడు వైసిపి విజయం కోసం ఎంతో కష్టపడినా నటుడు మోహన్ బాబు రజనీకాంత్ కు చాలా ఆప్త మిత్రుడు. ఇలా తన మిత్రుడిని తమ పార్టీ నాయకులు అనరాని మాటలు అంటూ ఉన్న ఈయన మౌనం వహిస్తున్నారు.

 

ఇలా రజనీకాంత్ విషయంలో మోహన్ బాబు మౌనం వహించడానికి కారణం ఏంటి? బహుశా ఈ కుట్రలో ఆయనకు కూడా బాగా ముందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా వైసిపి పార్టీ గురించి రజనీకాంత్ మాట్లాడి ఉంటే వైసిపి నాయకులు తిరిగి కౌంటర్ ఇవ్వడం సబబే అయినప్పటికీ ఇలాంటి మాటలతో మాట్లాడటం కరెక్ట్ కాదు.జగన్ పేరు ఎక్కడ ప్రస్తావించని రజినిపై ఇలాంటి విమర్శలు చేయడంతో రజిని ఫాన్స్ జగన్ తనకు క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -