Glasses: మనిషి అన్న తర్వాత ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం సర్వసాధారణం ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో చాలామంది కంటిచూపు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు.చిన్న వయసులోనే చాలామంది కళ్ళజోడు పెట్టుకుని ఉండడం మనం చూస్తున్నాము. ఇక ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల సైతం మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడటంతో చిన్న వయసులోనే కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.
ఇలా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నో మార్గాలను ఆలోచిస్తూ ఉంటారు.అయితే కంటి చూపు సమస్యతో బాధపడేవారు ఎక్కువగా విటమిన్ లభించే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని భావిస్తారు.ఈ విధంగా విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఎక్కువగా మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు కూర్చోకుండా చర్యలు తీసుకోవాలి.
ఇలా చేయటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు కూడా అధికంగా తీసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే మన ఇంట్లో లభించే యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో మన ఆరోగ్యానికి కావలసినటువంటి అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు యాలకులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఇలా యాలకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటిచూపుమెరుపు పడటమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా వీటిని తీసుకోవడం ద్వారా మనం బ్రతికినన్ని రోజులు కళ్ళజోడు లేకుండా మంచి కంటి చూపును పెంపొందించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీటితోపాటు విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు కూడా తీసుకోవడం తప్పనిసరి.