Viral: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన జగన్ పేదవారి సొంత ఇంటి కలలు నెరవేర్చిన సంగతి మనకు తెలిసిందే. ఎవరికైతే సొంత ఇల్లు లేదో అన్ని అర్హతలు ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇంటి పట్టాలు మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది తమ సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారు.అయితే 2019వ సంవత్సరంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన దండిబోట్ల నాగ సీత కనకదుర్గ ప్రభుత్వ ఇంటికి అప్లై చేసుకున్నారు.
అయితే తాజాగా ఆమె ప్రభుత్వ పట్టాను పొందడం కోసం అర్హురాలని గుర్తించిన అధికారులు తనకు ఇంటి పట్టాను ఇచ్చారు. అయితే ఆమె ఆ ఇంటి పట్టాను తిరస్కరించారు.2019 వ సంవత్సరంలో తనకు సొంత ఇల్లు లేకపోవడంతో ఇంటి కోసం అప్లై చేసుకున్నానని తెలిపారు. అయితే తర్వాత తన భర్త పేరు మీద ఉన్నటువంటి 100 చదరపు గజాల స్థలాన్ని అమ్మి తాను డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశానని ఇప్పటికీ ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిందని తెలిపారు.
ప్రస్తుతం తాను తన కొత్త ఇంట్లోనే నివాసం ఉంటున్నానని తనకు తన సొంత ఇంటి కల నెరవేరిందని ఈమె తెలియజేశారు. అందుకే తనకు మంజూరైన ఇంటిని ఇల్లు లేనటువంటి మరో అర్హురాలైనటువంటి మహిళకు ఇవ్వాలని తన ఇంటి పట్టాను తిరస్కరించి మరొక మహిళకు అందేలా చేశారు.తనకు ఉందని మరొకరికి సొంతింటి కల నెరవేరాలన్న ఉద్దేశంతో తన ఇంటి పట్టాను తిరిగి వెనక్కి ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా ఈమె చాలా గొప్ప పని చేస్తుంది అంటూ ఈమె మంచి పని పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.