Tollywood: రూ.100 కోట్లు సాధించిన సినిమాలివే..2022లో బ్లాక్ బాస్టర్ హిట్లు

Tollywood: ఆనాటి రోజుల్లో సినిమాలు వంద రోజుల నుంచి వెయ్యి రోజుల వరకూ ఆడేవి. వంద రోజులు సినిమా ఆడిందంటే అప్పట్లో అదొక సెన్సేషనల్ హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం రూ.100 కోట్లు వసూలు చేసిందా అని అందరూ అడుగుతున్నారు. సినిమా హిట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కలెక్షన్లు మాత్రం వంద కోట్లు వచ్చాయా అని ఇప్పుడు అందరూ చూస్తున్నారు.

 

సినిమా హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు పట్టించుకోవడం మానేశారు. భారీ కలెక్షన్లు తీసుకొచ్చిందా లేదా అనేదే చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎన్నో సినిమా విజయవంతం అయ్యాయి. అందులో కొన్ని రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఆ రూ.100 కోట్లు సాధించిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

2022లో తెలుగుతో పాటు ఓవరాల్ గా చూసుకుంటే 25కి పైనే సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ దగ్గర నుంచి నిఖిల్ ‘కార్తికేయ 2’ వరకు చాలానే సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే అందులో కేవలం 6 సినిమాలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరాయి.

 

భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, కార్తికేయ 2 వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లోకి చేరాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాకు రూ.158 కోట్లు, ‘సర్కారు వారి పాట’ సినిమాకు రూ.185 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా ట్యాగ్ తో రిలీజైన ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు రూ.149.1 కోట్లు, ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.1200 కోట్లపైనే గ్రాస్ వసూలు అయినట్లు సమాచారం. నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రానికి కూడా రూ.121 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -