Tollywood: టాలీవుడ్ మరో మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడెవరంటే?

Tollywood: టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచాడనే అనిపిస్తోంది. మూడేళ్లుగా ఒకే సినిమా కమిట్ అయిన రామ్ చరణ్ ఇకపై వరుస పెట్టి సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.

 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేయబోయే మరో కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా పలు విషయాలు తెలిశాయి. రామ్ చరణ్ -గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. త‌న 16వ సినిమా గురించి రామ్ చరణ్ ఇది వరకూ అనౌన్స్ కూడా చేశారు. యు.వి.క్రియేష‌న్స్‌, ఎన్‌వి.ఆర్ సినిమా ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రానుంది.

 

తాజాగా రామ్ చరణ్ తన తదుపరి సినిమా గురించి ఓ వార్త వినిపిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా చరణ్ సినిమా ఓ సినిమా చేయనున్నాడు. శాండిల్ వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఈ కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ప్రశాంత్నీల్, రామ్చరణ్, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

ఈ ఏడాది దసరా పండగ రోజు ప్రశాంత్ నీల్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. వారితో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరి కాంబోలో సినిమా ఉంటుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైతే ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -