Tarak: మహిళ కోసం కుర్చీలు తుడిచిన తారక్.. ఇలాంటి హీరోలు ఉన్నారా?

Tarak: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి భారీ సంఖ్యతో అభిమానులు క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్‌కి మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కన్నడ రాష్ట్రంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రజ్యోత్సవ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్‌ను ముఖ్య అతిథులుగా పిలిచారు. ఈ వేడుకలో కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి ఎన్టీఆర్ ప్రస్తావించారు. ఆయన ఎంతో మందికి సహాయం చేస్తూ, అనాథ పిల్లలకు ఆయన ఓ తండ్రిగా ఉంటూ వారి బాగోగులు చేస్తూ ఉండేవారు. కానీ ఆయన హఠాత్మరణం కర్ణాటక ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడిన మాటలు అక్కడి వారిని అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ వేదికపై కుర్చీలు తుడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇద్దరు మంచి స్నేహితులు. ఈ విషయాన్ని పునీత్ రాజ్ కుమార్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఎన్టీఆర్ ఆయనకు ఒక సోదరసమానులు అని చాల సార్లు చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఎన్టీఆర్ పునీత్ సినిమాలో కూడా ఒక పాటను కూడా పాడారు. అలాగే ఈ ఏడాది కన్నడ రజ్యోత్సవ కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్‌కు అవార్డును కూడా ప్రకటించగా.. ఆ వేడుకకు ఎన్టీఆర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైన విమానంలో వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్ళగానే ఆ రాష్ట్ర ప్రముఖ మంత్రులు ఎన్టీఆర్‌కి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ను స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లే వరకు కూడా భారీ కాన్వాయ్‌తో బందోబస్తు కల్పించారు. ఇక ఎన్టీఆర్ అక్కడికి వస్తున్నారన్న సమాచారం తెలియడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ చైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. సుధా మూర్తి కుర్చీలో కూర్చోబోతుండగా జూనియర్ ఎన్టీఆర్ కుర్చీ పైన వర్షపు నీళ్ళు పడి ఉండడంతో తనే స్వయంగా బట్ట తీసుకొని తుడిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -