Tollywood: భర్త చనిపోయినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు వీళ్లే!

Tollywood: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకుని జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. అయితే అన్ని బంధాలు సంతోషంగా ఉంటాయనే రూల్ లేదు. వివాదాలు, మనస్పర్థల వల్ల చాలా మంది విడిపోయిన వాళ్లు ఉన్నారు. అలాగే భర్తలు, లేదా భార్యలు చనిపోయి ఒంటరిగా మిగిలిన వాళ్లూ ఉన్నారు. అప్పట్లో భర్త లేదా భార్య చనిపోతే మిగిలిన వారు రెండో పెళ్లికి దూరంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పట్టింపులు లేవు. కాలాన్ని బట్టి మనుషులు మారుతున్నారు. పెళ్లి చేసుకుని మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్న ఈ కాలంలో.. భర్త చనిపోయి ఒంటరిగా బతుకుతున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రెండో పెళ్లి చేసుకోకుండా.. వారి జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు.

 

 

ఉదయ్ కిరణ్ భార్య విషిత..

అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్ సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. విషితను పెళ్లి చేసుకున్న ఉదయ్ కిరణ్.. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురై 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత.. విషిత రెండో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉద్యోగం చేస్తోంది.

 

 

నటి సురేఖావాణి..

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు సురేఖా వాణి. అక్కా, వదిన.. ఇలా రకరకాల పాత్రల్లో నటింస్తుంటారు. సురేఖా వాణి.. సురేష్ తేజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2019లో సురేఖావాణి భర్త కన్నుమూశారు. ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోకుండా ఉంది.

 

 

విలన్ రఘువరణ్ భార్య రోహిణి..

విలన్ రఘువరణ్ గురించి అందరికీ తెలిసిందే. విలనిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రఘువరణ్ భార్యే రోహిణి. కొన్నేళ్ల తర్వాత రఘువరణ్ మృతి చెందారు. దాంతో ఆమె రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటోంది.

 

 

బుల్లితెర ఆర్టిస్టు రాగిణి..

బుల్లితెర ఆర్టిస్టు రాగిణి గురించి అందరికీ తెలిసిందే. వివాహం జరిగిన కొన్నేళ్లకే ఆమె భర్త చనిపోయారు. ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. వాళ్ల అక్కపిల్లలతో కలిసి జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే శ్రీహరి భార్య డిస్కోశాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 ఏళ్ల క్రితం మరణించాడు. దాంతో అప్పటినుంచి డిస్కోశాంతి ఒంటరిగానే ఉంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -