Trisha: తప్పటడుగులు వేస్తున్న త్రిష.. కెరీర్ ఖతం అంటూ?

Trisha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తన అందంతో ఎంతోమందిని దశాబ్దాలుగా అలరిస్తున్న హీరోయిన్ల జాబితాలో త్రిష కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన త్రిష.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన త్రిష.. కాస్త గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టేసింది.

క్రేజీ డైరెక్టర్ మణిరత్నం ఈ మధ్యన చేసిన పీఎస్1 (పొన్నియన్ సెల్వన్) సినిమాలో త్రిష స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించి.. అందరినీ ఆకట్టుకుంది. స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ లో అందాల తార ఐశ్వర్యా రాయ్ కన్నా త్రిష అందంలో అద్భుతం అనేలా కనిపించింది. దీంతో అందరూ త్రిష గురించి విపరీతమైన పాజిటివ్ గా మాట్లాడటం మొదలుపెట్టేశారు. పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉన్నా కానీ త్రిషకు మాత్రం ఈ సినిమా విపరీతంగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి.

త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన ఆఫర్లు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. తమిళంలో అమ్మడు మూడు భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రిషకు మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో అమ్మడు భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. మంచి రెమ్యునరేషన్ ఇస్తే ఎలాంటి సినిమాలు అయినా చేయడానికి కూడా త్రిష వెనకాడటం లేదనే టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా త్రిష రెమ్యునరేషన్ కోసం ఓ నెగిటివ్ షేడ్ ఉండే పాత్రకు ఓకే చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారీగా రెమ్యునరేషన్ ని ఇచ్చినందుకు త్రిష.. నెగిటివ్ షేడ్ ఉండే పాత్రను చేయడానికి సిద్ధమని చెప్పిందని తెలుస్తుండగా.. దీని వల్ల ఆమె కెరీర్ నాశనం అవడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన త్రిష.. రెమ్యునరేషన్ మోజులో పడి తప్పటడుగు వేస్తోందని.. దీని వల్ల ఆమెకు తీవ్ర నష్టం తప్పదని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం.. రఘురామ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Raghurama Krishnamraju: నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలు విషయాలపై చర్చించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ...
- Advertisement -
- Advertisement -