Anasuya: దెయ్యం అంటూ అనసూయపై ట్రోలింగ్.. ఏమైందంటే?

Anasuya: యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అనేక రకాల పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్ని కాంట్రవర్సీల్లోనూ అనసూయ ముందు వరుసలో ఉంటారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెబుతుండడంతో కొందరు వ్యక్తిగతంగా కామెంట్లు చేయడం ఇందుకు దారి తీస్తోంది.

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హలోవిన్ వేడుకలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల దక్షిణ కొరియా హలోవిన్ సెలబ్రేషన్ సందర్భంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. సుమారు 300 మందికిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో నటి అనసూయ కూడా తాజాగా హ్యాపీ హలోవిన్ పేరుతో వేడుకలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

 

అనసూయ హలోవిన్ వేడుకల నేపథ్యంలో నెటిజన్లు ఆమె పోస్టుకు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. హలో విన్ అనేది మన సంస్కృతి కాదంటున్నారు. పాశ్చాత్య దేశాల కల్చర్ ను మనం ఫాలో కావడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హలో విన్ పేరిట స్కూళ్లలోని పిల్లలకు కూడా వింతైన దుస్తులు వేస్తూ కొత్త పోకడలకు పోతున్నారని మండిపడుతున్నారు.

 

నీ మొహం చూస్తేనే భయంగా ఉందంటూ..
ఇక హలోవిన్ సెలబ్రేషన్స్ లో భాగంగా యాంకర్ అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. వెనుక వైపు దెయ్యం బొమ్మ రూపంలో థీమ్ ఉంది. వాటి ముందు అనసూయ నిలబడి దెయ్యంలా భయపెట్టే పోజు ఇచ్చింది. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దారుణమైన ట్రోలింగ్ మొదలు పెట్టారు. నీ మొహం చూస్తేనే భయంగా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిన్ను చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తోందంటూ మరికొందరు కామెంట్లలో హోరెత్తిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -