Shruti Haasan: శృతి హాసన్ పై దారుణంగా ట్రోల్స్.. చివరకు?

Shruti Haasan: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. రియల్ ప్రపంచంలో సాధ్యం కాని ఎన్నో వెండి తెర మీద మనకు కనువిందు చేస్తుంటాయి. అయితే వెండి తెర మీద హీరో, హీరోయిన్ల కాంబినేషన్ అనేది సినిమాకు ఎంతో కీలకం. చూసే వాళ్లకు ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంటే సినిమాకు మంచి ప్లస్ అవుతుంటుంది. అయితే ముదురు హీరోల విషయంలో మాత్రం హీరోయిన్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంటుంది. దాంతో యంగ్ హీరోయిన్లనే సదరు హీరోల సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు.

 

తెలుగులో ప్రస్తుతం ముదురు హీరోల సరసన బెస్ట్ ఛాయిస్ గా హీరోయిన్ శృతి హాసన్ పేరు వినిపిస్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తుండటంతో పాటు, నందమూరి నటసింహం బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీ పడుతుండటం తెలిసిందే.

 

అయితే ఇలా చిరంజీవి మరియు బాలయ్యలతో శృతి హాసన్ సినిమాలు చేయడం మీద ట్రోల్స్ వస్తున్నాయి. శృతి హాసన్ కి అవకాశాలు లేక ఇలా చేస్తోందా? లేదంటే డబ్బుల కోసం ఇలా చేస్తోందా? అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న అమ్మడు.. ట్రోలర్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీటన్నింటికి అమ్మడు సమాధానం ఇచ్చింది.

 

సినిమా రంగంలో వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని హీరోయిన్ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చు అని వివరించింది. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని శృతి హాసన్ వివరించింది. మొత్తానికి ముదురు హీరోలతో తాను చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో అమ్మడు ఏమాత్రం ఇబ్బందిపడట్లేదనే క్లారిటీ అయితే ఇచ్చేసింది.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -