Hyderabad: ప్రస్తుత సమాజంలో యువత ప్రేమ అన్న ఊబిలో కూరుకుపోయి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. కొందరు ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇంకొందరు తాను ప్రేమించిన యువతీ మరొకరికి దక్కకూడదు అని ప్రేమించిన యువతిని చంపి వారు చనిపోతున్నారు. నిత్యం సమాజంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చేతికి వచ్చిన కొడుకు కూతుళ్లు అలా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుండడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా తెలంగాణ హైదరాబాద్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు స్నేహితులు. అయితే వీరిద్దరూ అదే యూనివర్సిటీకి చెందిన ఓ యువతిని ప్రేమించారు. ఈ విషయంలో ఇద్దరికి గొడవలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హరిహర ఎలా అయినా చేసి తన ప్రియురాలిని దక్కించుకోవాలి అనుకున్నాడు. తనకు అడ్డుగా ఉన్న నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని భావించి పథకం పన్నాడు. ఒకరోజు హరిహర, నవీన్ కు ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని హైదరాబాద్ రావాలన్నాడు. హరిహర ప్లాన్ గురించి తెలియని నవీన్ హైదరాబాద్ కు వెళ్ళాడు.
అక్కడ ఓ రూమ్ లో ఇద్దరు పార్టీ చేసుకున్నారు. అనంతరం వీరి మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే నవీన్ తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇక ఆ తరువాత నవీన్ ను హరిహర కొట్టి చంపేశాడు. అనంతరం బాడీని హైదరాబాద్ విజయవాడ హైవేపై పడేశాడు. అయితే 4 రోజులుగా నవీన్ కాలేజీకి రావడం లేదని తల్లిదండ్రులకు స్టాఫ్ ఫోన్ చేశారు. దీనితో అనుమానం వచ్చిన నవీన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాలేజీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. హరిహర ఫోన్ 4 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే అదే రోజు రాత్రి హరిహర పోలీసులకు లొంగిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి దక్కదనే నవీన్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ప్రేమించిన హరిహర జైలు పాలవ్వగా, నవీన్ ప్రాణాలు కోల్పోయాడు.