Upasana: సరోగసీ ద్వారా ఉపాసన తల్లయ్యారా.. ఏమైందంటే?

Upasana: మెగా కుటుంబం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆనంద క్షణాలు రానే వచ్చాయి. పెళ్లయి పది సంవత్సరాలు పూర్తయిన ఇంకా సంతాన భాగ్యం లేని రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు అనే వార్త ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. మొదట్లో ఇది కేవలం గాసిప్గా తీసుకున్నప్పటికీ స్వయంగా చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో “ఆంజనేయ స్వామి దయవల్ల త్వరలో రామ్ చరణ్ ఉపాసన తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు” అని ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు బాగా కుష్ అవుతున్నారు.

 

గత కొద్దికాలం నుంచి చరణ్ ఉపాసన ఎప్పుడు ఎక్కడ కనిపించినా పిల్లలు ఎప్పుడూ అన్న ప్రశ్న ఎదురయ్యేది. ఉపాసన ఎప్పుడూ ఇటువంటి ప్రశ్నలకు ఎంతో ప్రశాంతంగానే జవాబు చెప్పేది తప్ప ఎప్పుడూ రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. కానీ కొన్నాళ్ల క్రితం ఇటువంటి
ప్రశ్న ఎదుర్కొన్న ఉపాసన మొదటిసారి సీరియస్ అయింది.

 

ఈ తరుణంలో ఈ వార్త విని ఫ్యాన్స్ అందరూ సమస్య సాల్వ్ అయింది అని మురిసిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఉపాసనది ప్రెగ్నెన్సీ కాదు సరోగసీ అని ఒక వార్త ఫిలిం ఇండస్ట్రీలో సర్కిల్ కొడుతుంది. సెలబ్రిటీలు సరోగసీ ద్వారా పిల్లలను కనడం కొత్త విషయం ఏమీ కాదు. ఇదివరకు ఎంతోమంది ఈ రకంగా సరోగ్రఫీ ద్వారా తల్లులు తండ్రులు అయిన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు.

 

మంచు లక్ష్మీ దగ్గర నుంచి నిన్నగాక మొన్న పెళ్లయిన నయనతార వరకు ఎందరో సెలబ్రెటీరు ఇలా తల్లులైన వారే. అయితే రామ్ చరణ్ ,ఉపాసన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఇంకా ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ సరోగసీ విషయం నిజమే అయితే త్వరలో అధికారికంగా ఆ విషయం గురించి ప్రకటన రావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా ఇంకా ఎవరికీ తెలియదు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -