Veera Simha Reddy: స్టార్ హీరో బాలయ్యకు రేంజ్, క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!

Veera Simha Reddy: బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ తో షేక్ చేయాలంటే అది ఒక్క నందమూరి బాలయ్య మాత్రమే సాధ్యం. కరోనా దెబ్బతో జనాలు థియేటర్లకు రాకుండా భయపడుతున్న సమయంలో బాలయ్య ‘అఖండ’గా వచ్చి జనాల్ని తిరిగి థియేటర్లకు క్యూ కట్టేలా చేశాడు. అలాగే థియేటర్లో జనాలు సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేసేలా చేశాడు. చాలా కాలం తర్వాత నందమూరి బాలయ్య మరోసారి బాక్సాఫీస్ మీద వేటకు బయలుదేరుతున్నాడు.

 

ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్ మీద దాడికి సిద్ధమైపోయాడు. అయితే సంక్రాంతి బరిలో రాబోతున్న బాలయ్య ‘వీరసింహారెడ్డి’ విడుదలకు ముందే రికార్డులను సొంతం చేసుకుంటోంది. కొత్త రికార్డులకు బాలయ్య బాబు సినిమా కేరాఫ్ గా నిలుస్తోంది. అఖండ సినిమా రికార్డులను బాలయ్య కొత్త సినిమా తుడిచేస్తుండటం.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

 

అఖండ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ని మించి బాలయ్య ‘వీరసింహారెడ్డి’ బిజినెస్ చేయడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. వీరసింహారెడ్డి సినిమా ఇప్పటి వరకు రూ.76కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.22కోట్లకు సేల్ అయినట్లు సమాచారం. ఇక సీడెడ్ తో రూ.15కోట్లు, ఈస్ట్ లో రూ.5కోట్లు, గుంటూరులో రూ.6కోట్లు రేషియోలో రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ఇలా తెలంగాణ మరియు ఏపీలో కలిసి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి రూ.66కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇక తెలుగు సినిమాలను ఆదరించే జనాలు ఎక్కువగా ఉన్న కర్ణాటకలో రూ.7కోట్లు, ఓవర్సీస్ లో రూ.3కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం రూ.78కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ‘వీరసింహారెడ్డి’.. గతంలో ‘అఖండ’ ప్రీరిలీజ్ బిజినెస్ కన్నా రూ.18కోట్లు ఎక్కువ చేయడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ సంక్రాంతి విజేత బాలయ్య అంటూ అభిమానులు అప్పుడే జోష్ మీదున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -