Veera Simha Reddy: వీరసింహారెడ్డితో నటసింహం బాలకృష్ణ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. అఖండ తర్వాత బాలయ్య వరుసగా రెండోసారి వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. గోపీచంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, రాయలసీమ ప్యాక్షన్ తరహాలో తీశాడు. కత్తులు, కార్లు గాల్లోకి లేవటాలు మరోసారి చూపించాడు గోపిచందర్.
తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ దుమ్ముదులిపేస్తోంది. ఈ సినిమాపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ చెప్పారు. సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూనే బోయపాటి శ్రీను ఈ సినిమా తీసినట్టుగా ఉందని ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా చూస్తుంటే తనకు ఎన్టీఆర్ నటించిన చండశాసనలు మూవీ గుర్తుకు వచ్చిందన్నాడు. ఈ రెండు సినిమాలలో మెయిన్ స్టోరీ ఒకటే అని చెప్పారు.
ఇక సినిమా ఫస్ట్ అఫ్ చూసినంత సేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్టుగానే ఉందని ఫస్ట్ అఫ్ బంగారంగా ఉంటే సెకండ్ హాఫ్ బంగారానికి వెండికి మధ్యలో ఉన్నట్టు అనిపించిందన్నారు. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్ గా కామ్ అయిపోయి చెల్లిని చూసి తోక ఆడిస్తే ఎవరికీ చూడ బుద్ధి కాదని అయినా కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధమే ఈ సినిమాను కాపాడిందని ఆయన చెప్పారు.