Vijay Sethupathi: సినిమాలకు దూరం కానున్న విజయ్ సేతుపతి.. కారణమిదే!

Vijay Sethupathi: తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ నటుడికి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన నటుడే విజయ్ సేతుపతి. నటనలో తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతిని.. అభిమానులు ప్రేమతో మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటూ ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు.

 

ప్రస్తుతం తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా చాలా ప్రాజెక్టుల్లో విజయ్ సేతుపతి బిజీగా ఉన్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క విలన్ గా, గెస్ట్ రోల్స్ లో విజయ్ సేతుపతి వెండి తెర మీద అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా విజయ్ సేతుపతి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడనే వార్త అందరికీ షాకిస్తోంది. సినిమాల విషయంలో విజయ్ సేతుపతి తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది.

 

హీరోగా, విలన్ గా, గెస్ట్ రోల్స్ లో తరుచుగా వెండి తెర మీద కనిపించే విజయ్ సేతుపతి.. ఇక మీద తక్కువ కనిపించాలని నిర్ణయించుకున్నాడట. విజయ్ సేతుపతి ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో ప్రేక్షకులు చాలాసార్లు చూస్తుండటంతో అతడి వల్ల సినిమాలకు ఓపెనింగ్స్ తక్కువ వస్తున్నాయట. అందుకే ఇక మీద స్క్రీన్ అప్పియరెన్స్ తగ్గించాలని విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

విజయ్ సేతుపతి ఇక మీదట ఏడాదికి మూడు కోలీవుడ్ సినిమాలు, ఇతర భాష సినిమా ఒక దానిలో మాత్రమే కనిపించాలని నిర్ణయం తీసుకున్నాడట. దీని వల్ల ఓపెనింగ్స్ ఇబ్బంది తలెత్తదు అని అతడు భావిస్తున్నాడట. మొత్తానికి విజయ్ సేతుపతి నిర్ణయం ఫ్యాన్స్ కు కాస్త షాకిచ్చింది. కాగా విజయ్ సేతుపతి ‘మైఖేల్’ లో కీలక పాత్ర పోషిస్తుండగా, రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఫర్జీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -