Vijaya Shanthi: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి పరువు పోయేలా?

Vijaya Shanthi: మాములుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఆన్ స్క్రీన్ జంటలను చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించడంతో పాటు మళ్లీ మళ్లీ ఆ కాంబినేషన్లో చూడాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి కాంబినేషన్స్ లో ఒకటి చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్లిద్దరి కలిసి దాదాపుగా 25 సినిమాలలో నటించారు. కాగా ఆ సినిమా లలో 90 శాతం వరకు అన్నీ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కాగా విజయశాంతి చిరంజీవితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో కలిసి నటించగా ఈ సినిమాకు గాను ఆమె మెగాస్టార్ తో పాటు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుందట.

ఈ సినిమా తరువాత విజయశాంతి,చిరు కాంబినేషన్ నేషన్ లో మళ్ళీ సినిమాలు రాలేదు. ఇకపోతే అసలు విషయం లోకి వెళితే. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చిరంజీవి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సినీ పరిశ్రమకి ఎంతో ఇచ్చారు. కానీ సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు తెలంగాణకి అంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరైనా మాట్లాడారా? చిరంజీవి గారు పార్టీ పెట్టారు. తెలంగాణ ప్రజల కోసం ఏమి పోరాటం చేసారు. అందరూ ముసుగు దొంగలే, ఎవరికీ ధైర్యం లేదు అంటూ విజయ శాంతి చేసిన కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి సంపూర్ణంగా తప్పుకోగా, విజయ శాంతి మాత్రం ఇప్పటికీ యాక్టీవ్ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా హీరోయిన్ విజయశాంతి ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -