Virat: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 2020 జరుగుతోండగా.. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో కోమ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. గురువారం పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సందర్బంగా ఆర్సీబీ ఓపెనర్ డూప్లెసిస్తో కలిపి ఓపెనింగ్గా రాగా.. ఏడో ఓవర్లో రాహుల్ చహర్ బౌలింగ్లో మూడో బంతికి కోహ్లీ 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
30 పరుగులు చేయడంతో కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. అందేంటంటే.. ఐపీఎల్లో ఎక్కవసార్లు 30 ప్లస్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దీంతో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 100 సార్లు 30 ప్లస్ స్కోర్ చేశాడు. దీంతో ఐపీఎల్లో ఇప్పటివరకు 100 సార్లు 30 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. దీంతో ఇది కోహ్లీకి అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. అయితే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డూప్లెసిస్ ఉన్నప్పటికీ.. కోహ్లీ కెప్టె్గా వ్యవహరించాడు.
డూప్లెసిస్ రెగ్యూలర్ కెప్టెన్గా ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు టాస్ సమయంలో కోహ్లీ చెప్పాడు. డూప్లెసిస్ నేటి మ్యాచ్లో ఫీల్డింగ్కు రాడని, తొలుత తాము బ్యాటింగ్కు దిగుతున్నాం కబట్టి డూప్లెసిస్ తనతో కలిస బ్యాటింగ్కు వస్తాడని తెలిపాడు. బౌలింగ్ సమయంలో డూప్లెసిస్ స్థానంలో వైశాక్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా రానున్నాడని కోహ్లీ తెలిపాడు.అయితే ఐపీఎల్లో కోహ్లీకి ఇప్పటికే అనేక రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు, సెంచరీ, హాఫ్ సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ గతంలో అనేక రిాకార్డులు సృష్టించాడు.