KCR: సీఎం కేసీఆర్ కు వార్నింగ్.. కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతున్నాయా?

KCR: తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కెసిఆర్ గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు పెట్టిన తర్వాత కర్ణాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ కు గతం కంటే సగం సీట్లు పడిపోయాయి అని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఇంకా ఆరు నెలలే సమయం ఉందని ఆ తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడ ఖాయం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి రెండు సార్లు అధికారాన్ని కట్టమెట్టాము. కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అహంకారం, చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు అర్థమైంది అని చెప్పుకొచ్చారు.

90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల గేట్లకు రంగేసి తామే పూర్తి చేసామని చెప్పటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే లక్ష కట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. చట్ట విరుద్దంగా సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తులకు దొడ్డిదారిన సంతకాలు పెట్టే పదవులిచ్చావని మండిపడ్డారు. ఇలాంటి రాష్ట్రం కోసమా అమరవీరులు ఆత్మబలిదానం చేసుకున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తిలో సేవ్ వనపర్తి పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఎనిదేండ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని పొంగులేటి మండిపడ్డారు.

 

ప్రతి గింజా కొంటామన్న కేసీఆర్ వర్షంలో ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాప్సికంతో రూ. 10 కోట్లు లాభమొచ్చిందన్న కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి ఎంత మంది రైతులను చైతన్యవంతుల్ని చేశారని నిలదీశారు. ఇప్పటికి రెండుసార్లు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన కేసీఆర్ మూడోసారి కూడా రైతులకు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కలలుకంటున్నారని ఆయన విమర్శించారు. రుణమాఫీ చేయకపోవటం వల్ల బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్లతో ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని అది జరిగే పనికాదని ఎద్దేవా చేశారు శ్రీనివాస్ రెడ్డి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -