Ram Charan: తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినీ బృందం తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ సంబరంలో మునిగాయి. దేశం గర్వించే విధంగా ఈ సినిమా చరిత్రను సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులు సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఆస్కార్ రావడంతో ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ ఘనతలో ఎన్టీఆర్ ప్రధాన కారణం అని అర్థం వచ్చేలా ఆస్కార్ నిర్వాహకులు ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు బాగా హైలెట్ చేశారు.
ఈ ఆస్కార్డ్ అవార్డును అందుకోవడానికి కీరవాణి, చంద్ర బోస్ వేదిక పైకి వచ్చిన సమయంలో ఆస్కార్ వేదిక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రమే బాగా హైలెట్ గా ఉంది. దీంతో అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో కనిపిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నటనకు దక్కిన గౌరవం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కర్స్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో బాగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
కానీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం కాస్త నిరాశగా ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఫోటోను హైలెట్ చేయకపోవడంతో చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. దీంతో కొందరు కావాలనే రామ్ చరణ్ ను అలా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫోటో హైలెట్ అవ్వడం మాత్రం మామూలుగా లేదని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.