NTR: శతజయంతి వేడుకలకు తారక్ రాకపోవడానికి ఆ వార్నింగ్ కారణమా?

NTR: సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్నకి అటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా కోపాన్ని తెప్పిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ కి నిజమైన వారసుడిగా ఆయన రూపులతో ఉన్న మనవళ్లలో ఎవరైనా ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని శత జయంతి ఉత్సవాలకి రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశారు అంటున్నారు అభిమానులు. సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే శతజయంతి ఉత్సవాలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ తలచుకుంటే ఆ ఉత్సవాలకి వచ్చేవాడే కానీ నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ముల కు ఉత్సవాలకి రాకూడదంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం.

 

తన వల్ల ఎవరు బాధపడకూడదు అనే స్వభావం కలిగిన జూనియర్ ఎన్టీఆర్ అందుకే తాతగారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదంట. అయితే నెటిజన్స్ మాత్రం ఉత్సవాల్లో పాల్గొనలేదని జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ సిద్దు జొన్నలగడ్డ నాగ చైతన్య తదితర కుర్ర హీరోలు అందరూ హాజరైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 

దీనిపై జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టారు. రాజకీయంగా కానీ సినిమాల పరంగా కానీ తనమీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ నోరు మెదపకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. కానీ అయినా అభిమానులు మాత్రం ఈ ట్రోల్స్ ని భరించలేకపోతున్నారు.

 

ఎన్టీఆర్ పై కావాలనే నెగిటివిటీ వ్యాపింప చేస్తున్నారని తారక్ అసలు ఏం తప్పు చేశాడు అతనిపై ఎందుకు అంత వ్యతిరేకత అని ప్రశ్నిస్తున్నారు. రీ రిలీజ్ అయిన సింహాద్రి సినిమా విషయంలో కూడా అసలు కలెక్షన్స్ దాచి సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు అంటూ నెగిటివిటీని ప్రచారం చేశారు అంటూ తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -