Veera Simha Reddy: ఆ వ్యక్తి ప్లాన్ వల్లే వీరసింహారెడ్డి ఫ్లాప్ అయిందా?

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో తొడ కొట్టి బాక్సాఫీస్ రికార్డుల వేటకు బయలుదేరిన బాలయ్య బాబు సినిమాకు రెండో రోజు నుండి కాస్త కలెక్షన్లు తగ్గాయనే టాక్ ఉంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా చేసిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి ముందు రోజు విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.

టాలీవుడ్ లో బాలయ్య సినిమా వస్తుందంటే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అదీ కాక అంతకు ముందు బాలయ్య ‘అఖండ’తో భారీ హిట్ ను అందుకోవడంతో పాటు కరోనా దెబ్బకు విలవిలలాడిన టాలీవుడ్ కు మంచి ఊపునిచ్చాడు. అయితే తాజాగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా థియేటర్లలో బాగా సందడి చేస్తున్నా.. కొంతమంది మాత్రం సినిమా మీద పెదవి విరుస్తున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో నెగిటివ్ టాక్ రావడానికి, ప్లాఫ్ టాక్ రావడానికి ఒక వ్యక్తి కారణం అనే వార్త టాలీవుడ్ లో దావాణంలా వ్యాపించింది. నందమూరి ఫ్యాన్స్ ఈ వార్త గురించి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ‘వీరసింహారెడ్డి’ సినిమా ఫస్టాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందని, కానీ సెకండాఫ్ విషయంలోనే కాస్త మిక్స్డ్ టాక్ వినిస్తోంది. అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్ కు కారణం కూడా ఈ సెకండాఫే అని తెలుస్తోంది.

‘వీరసింహారెడ్డి’సెకండాఫ్ లో ఏదో ఇబ్బంది ఉందని, దానిని ట్రిమ్ చేయాలని దర్శకుడు గోపిచంద్ మలినేని భావించాడట. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చాడట. దీంతో దర్శకుడు సినిమా సెకండాఫ్ ను ఎలాంటి ట్రిమ్ చేయకుండా వదిలేశాడట. అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అతడే ఈ సినిమా ప్లాఫ్ అవడానికి కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. మైత్రి సంస్థలో పని చేసే ఒక వ్యక్తి అని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -