ఆ నటి గురించి మరో నటి సంచలనం.. పెళ్లైన డైరెక్టర్‌ను సీక్రెట్‌గా రెండోపెళ్లి చేసుకుందట!

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణ. ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.

పలు చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించి మెప్పించింది. బెంగళూరులో పుట్టిన ఈ తమిళ అమ్మాయి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

తమిళంలో సూర్య నటించిన సెవెన్త్‌ సెన్స్‌ చిత్రంతో సినిమాల్లో రంగ ప్రవేశం చేసింది ధన్య బాలకృష్ణ. తెలుగులో నేను శైలజ, జయజానకి నాయక చిత్రాల్లో తనదైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ధన్య బాలకృష్ణ.

సుధీర్‌ సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గానూ నటించింది. మహేష్‌ బాబు, విక్టరీ వెంకటేష్‌ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ధన్య చెప్పిన డైలాగ్‌ యువత ఇప్పటికీ మర్చిపోలేరు.

మహేష్‌ బాబుకు ప్రపోజ్‌ చేస్తున్నానంటూ ఆ సినిమాలో డైలాగులు చెబుతుంది ధన్య బాలకృష్ణ.

ఇక ఈ మధ్యనే ధన్య బాలకృష్ణ ఓటీటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్‌లో దర్శనమిచ్చింది.

అయితే, ధన్య బాలకృష్ణ గురించి రీసెంట్‌గా మరో నటి చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకుందట. ఇది జరిగి కూడా ఏడాది పూర్తి కావస్తోందట. టాలీవుడ్‌లో మరో నటి కల్పిక గణేష్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ వీడియో చేసిన కల్పిక అందులో ధన్య బాలకృష్ణ కోలీవుడ్‌ డైరెక్టర్‌ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుందని చెప్పింది.

మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేదని చెప్పింది.

అప్పటికే బాలాజీకి పెళ్లై భార్యకు విడాకులు ఇచ్చాడని, ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకొని కాపురం చేస్తోందంటూ బాంబ్‌ పేల్చింది.

ఇలా వారు కలిసి ఉన్నప్పటికీ బయటి ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదని కల్పిక చెప్పింది.