పూజా హెగ్డే టాలీవుడ్ ఐరన్ లెగ్ గా మారిందా?

ఎంట్రీ నుండి పెద్ద హిట్లు ఏమి కొట్టకపోయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది పూజా హెగ్డే.

ఇక ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన బుట్టబొమ్మగా మంచి పేరు తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. దీనితో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ బుట్టబొమ్మగా మారింది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా మిగతా ఇండస్ట్రీల్లో కూడా మంచి పేరే తెచ్చుకున్న ఈ సుందరి.. ఈ మధ్య కెరీర్ లో కాస్త వెనుకబడినట్టు కనిపిస్తుంది.

పూజా హెగ్డే ఇటీవల నటించిన రాధేశ్యామ్ (ప్రభాస్ తో), ఆచార్య (రామ్ చరణ్, చిరంజీవి) సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇలా వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజా కొంత వెనుకబడిపోయినట్టు సినీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

దీనితో అవకాశాలు కూడా వచ్చినట్టే వచ్చి దూరం అవుతున్నాయట. దర్శక నిర్మాతలు కూడా ఈ హీరోయిన్ ను ఎంపిక చేసే చేసే విషయంలో వెనుకా ముందు అయిపోతున్నారు. ఇటీవల కూడా ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కోల్పోయిందట.

పవర్ స్టార్ తర్వాతి మూవీ “ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌” హరీష్ శంకర్ దర్శకత్వంలో తీయనున్నారని ఇటీవల ప్రకటించారు.

అయితే ఈ మూవీ కోసం ముందుగా హీరోయిన్ గా పూజా హెగ్డే ను అనుకున్నారట. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా..

ఇక ఏమైందో ఏమో తెలియదు గానీ ఇప్పుడు ఈ సినిమా నుండి హీరోయిన్ గా పూజా ను తప్పించినట్టు టాక్ నడుస్తోంది. అయితే పూజా ఇటీవల వరుస ఫ్లాపులు మూటకట్టుకోవడమే తనను రిజెక్ట్ చేయడానికి కారణం అయి ఉంటుందని అంత అనుకుంటున్నారు.

ఇక ముందుగా అనుకుని తర్వాత తొలగించడం పట్ల రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూజా హెగ్దే ఐరెన్‌ లెగ్‌ అనే ప్రచారమే దీనికి కారణం అని కొందరు అంటుండగా..

డేట్స్‌ సర్దుబాటు కాకపోయి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా

ఈ విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇలా పవర్ స్టార్ తో సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌ నుంచి పూజా బయటకు రావడం తనకు మైనస్సే అని టాక్ వినిపిస్తోంది.