ఈ 12 మంది తారల మరణం వెనుక మిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ లో మంచి నటుడిగా, రాబోయే రోజుల్లో పెద్ద స్టార్ గా ఎదుగుతాడనుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిన్న వయసులోనే మరణించాడు. ధోని మీద చేసిన బయోపిక్ తో అందరినీ అలరించిన సుశాంత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే ఇతడి మరణం వెనక మిస్టరీ ఏంటో ఇప్పటికీ తెలియరాలేదు.

కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపు సాధించిన పునీత్ రాజ్ కుమార్ ను అక్కడ ఎంతో అభిమానిస్తుంటారు. జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది. అయితే గుండెపోటు ఎందుకు వచ్చిందనే దానిపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నా అసలు నిజం మాత్రం బయటకు రాలేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులో టాప్ హీరోలకు ధీటుగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో ఎంతో పాపులర్ అయిన స్టార్ హీరోయిన్ సౌందర్య. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సౌందర్య.. హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే ఆమె మరణం వెనక ఎంతో మిస్టరీ దాగుందనేది ఇండస్ట్రీ టాక్.

సినీ అభిమానులను ఒక ఊపు ఊపేసిన దివ్య భారతి మరణం వెనక ఉన్న అసలు నిజాలు ఇప్పటికే తెలియదు.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తీ అగర్వాల్.. టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. మహేష్ బాబు లాంటి నాటి యంగ్ హీరోలతో పాటు వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో కూడా ఆర్తీ అగర్వాల్ చేసింది. అయితే మరణంతో కూడా చాలా ప్రశ్నలు ముడిపడి ఉన్నాయి.

తన అందంతో దక్షిణాది ఇండస్ట్రీని ఊపేసిన అలనాటి హీరోయిన్ సిల్క్ స్మిత మరణం కూడా మిస్టరీతో కూడుకొని ఉంది. ఈమె మరణం వెనక ఉన్న అసలు నిజాలు ఇప్పటికీ బయటకు రాలేదు.

కెరీర్ పరంగా టాప్ లో ఉన్నప్పుడు మరణించిన మరో హీరోయిన్ ప్రత్యూష. ఉదయ్ కిరణ్ సినిమాతో ఎంతో పాపులర్ అయిన ప్రత్యూష అనుమానాస్పదంగా మరణించింది.

ప్రేమికుల రోజు సినిమాతో ఎంతో పాపులర్ అయిన కునాల్ సింగ్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే కునాల్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ.

ఓ రోడ్డు ప్రమాదంలో అష్టాచెమ్మా భార్గవి అకాల మరణం చెందింది.

ఎంతో సినీ భవిష్యత్తు ఉన్న విజయసాయి, యశో సాగర్ అకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది.