వాళ్లపై ఫైర్ అయిన హీరోయిన్ రష్మిక.. సీరియస్ అవుతూ?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలలో చిక్కుకుంటున్నారు.ఇదివరకు ఈమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేది.

అయితే ఈ వార్తలపై స్పందించిన ఈమె ఒకానొక సమయంలో తనదైన శైలిలో ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్నను బ్యాన్ చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేయడం వల్ల కొన్ని బ్రాండ్స్ కూడా రష్మికను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇలా తన గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉన్నటువంటి రష్మిక విసిగిపోయి ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం మొత్తం కాంతార సినిమా విషయం వల్లనే జరిగింది అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నడ చిత్ర పరిశ్రమ నన్ను బ్యాన్ చేసిందని వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.నాకు కన్నడ చిత్ర పరిశ్రమపై ఇప్పటికి ఎంతో గౌరవం ఉందని ఎవరు కూడా నన్ను బ్యాన్ చేయలేదని తెలిపారు.

ఇకపోతే కాంతార సినిమా చూశారా అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను ఇంకా అప్పటికి సినిమా చూడలేదు కనుక చూడలేదు అని సమాధానం చెప్పాను.

నాకు సమయం దొరికినప్పుడు సినిమా చూసి చిత్ర బృందానికి కంగ్రాట్స్ అంటూ మెసేజ్ కూడా పంపించానని దానికి వాళ్లు కూడా థాంక్యూ అంటూ రిప్లై కూడా ఇచ్చారని ఈమె తెలిపారు.

సినిమాల వరకు నేను బాధ్యతగా ఉంటా కానీ నా పర్సనల్ విషయాలను కూడా కెమెరా పెట్టి అందరికీ చూపించాలంటే సాధ్యం కాదంటూ

ఈమె తన గురించి వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా రష్మిక ఈ విషయాలన్నింటి గురించి క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్లేనని తెలుస్తోంది.