భార్యల ద్వారా కోట్ల ఆస్తిని కట్నంగా తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఇలా ఎంతో ధనవంతులైన కుటుంబానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకొని కోట్ల రూపాయలను కట్నంగా తీసుకున్నారు.

మరి కోట్ల ఆస్తులున్న వ్యక్తుల కూతుర్లని పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీ లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్నారు. ఇక లక్ష్మీ ప్రణతి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాస్ రావు కుమార్తె.

ఈయనకు కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి. సుమారు 250 కోట్ల విలువచేసే ఆస్తులను కట్నంగా తీసుకువచ్చింది లక్ష్మి ప్రణతి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2011లో స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈమె తల్లితండ్రులు ప్రముఖ వ్యాపారవేత్తలు.. స్నేహారెడ్డి కూడా వందల కోట్ల రూపాయలను కట్నంగా తీసుకువచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఉపాసన కామినేని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2012లో ఎంతో ఘనంగా జరిగింది.

వీరి తండ్రి కూడా అపోలో సమస్థలతో పాటు ఇతర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు వీరికి కూడా వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి.

రానా దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలు మిహీకా బజాజ్‌ ను 8 ఆగస్టు 2020న పెళ్లి చేసుకున్నారు.

రానా అత్తగారు క్రిసాల జ్యువలరీస్ కు ఓనర్. గోల్డ్ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటారు. వీరికి కూడా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి.