వాల్తేరు వీరయ్య విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

రాబోయే సంక్రాంతి కి టాలీవుడ్ లో హంగామా షురూ కాబోతుంది. ఇద్ద‌రు ఆగ్ర హీరోలు రెండు హై వోల్టేజ్ మూవీస్ తో సందడి చేయడానికి సంక్రాంతి కి థియేటర్లలోకి వస్తున్నారు.

చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి రెండు ఒక్క రోజు తేడాతో సంక్రాంతికి విడుదల కానున్నాయి.

బాల‌య్య కు, చిరు కు మధ్య కాంపిటీషన్ ఎప్పుడు ఓ రేంజ్ లో ఉంటుంది. ఇద్దరు హీరోలకు టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ భయంకరంగా ఉంది.

పైగా ఈసారి సంక్రాంతికి పోటీల మీద విడుదలవుతున్న ఈ రెండు మూవీస్ పై అంచనాలు ఇప్పటికే భారీగా నెలకొన్నాయి.

ఇంతకుముందు గతంలో కూడా రెండుసార్లు ఇదే విధంగా హోరాహోరీ పోటీ ఇద్దరి హీరోల సినిమాల మధ్య నెలకొంది.

1999 సంక్రాంతికి బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి, చిరంజీవి స్నేహంకోసం ఒకేసారి రిలీజ్ అయ్యాయి. కానీ బాలయ్య సమరసింహారెడ్డి తో ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సాధించాడు.

తిరిగి మళ్లీ 2001 సంక్రాంతి కి చిరు మృగ‌రాజు, బాల‌య్య న‌ర‌సింహానాయుడు మూవీస్ తో పాటు వెంక‌టేష్ దేవీపుత్రుడు కూడా రిలీజ్ అయింది.

మృగరాజు చిరంజీవి కెరీర్ లోని అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దేవీపుత్రుడు యావరేజ్ టాక్ తెచ్చుకోగా న‌ర‌సింహానాయుడు బాక్స్ ఆఫీస్ ను బంతాట ఆడింది. అప్పట్లో మృగరాజు ,నరసింహారెడ్డి రెండు సినిమా లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.

అలా ఆ సంక్రాంతికి ఇద్దరు హీరోల సరసన ఒకే హీరోయిన్ నటించింది. అయినప్పటికీ చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే, బాలకృష్ణ సినిమా ఊహించని సక్సెస్ సాధించింది.

తిరిగి ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఈ సంక్రాంతికి రాబోతున్న ఇద్దరు హీరోల సినిమాల్లో శృతీహాస‌న్ హీరోయిన్‌ గా నటిస్తుంది.

మరి అప్పటి సెంటిమెంట్ తిరిగి ఇప్పుడు కూడా వర్క్ అవుట్ అవుతుందా? చిరంజీవి మూవీ పై బాలయ్య మూవీ తిరిగి పైచేయి సాధించి హ్యాట్రిక్ సాధిస్తాడు ? తెలియాలి అంటే ఈ సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.