Khammam: పెళ్లింట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

Khammam: చావు ఎప్పుడు ఎటునుంచి ఎలా ముంచుకొస్తుందో చెప్పడం అంచనా వేయడం ఎలా కష్టం. అప్పటికి వరకు నవ్వుతూ ఉన్నవారు మరుక్షణమే మరణించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అటువంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు ప్రమాదాల వల్ల మరణిస్తుంటే మరికొందరు గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

చాలామంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఒక మహిళ పెళ్లి వేడుకలో అందరితో ఆనందంగా, సరదాగా, సంతోషంగా డాన్స్ చేస్తోంది. కానీ అంతలోనే ఊహించని దారుణం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా అల్లీపురంలో రాణి అనే మహిళ తమ బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లింది. బారాత్ లో భాగంగా డీజే సౌండ్స్ తో వధూవరుల బంధుమిత్రులు మంచి జోష్ లో డ్యాన్స్ చేస్తున్నారు. రాణి అనే మహిళ కూడా హుషారుగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది.

 

అయితే డాన్స్ చేస్తున్న కొద్ది సేపటికే ఆమెకు స్టోక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. అలాగే ఆమె చనిపోవడానికి కారణం డీజే సౌండ్స్ అని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. మృతురాలు రాణి రఘునాథపాలెం కి చెందిన వివాహిత అని తెలుస్తోంది. అయితే అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేసిన రాణి హఠాత్తుగా కన్నుమూయడంతో పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. రాణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -