TDP: తెలంగాణలో టీడీపీ గెలుపు కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్.. ఏమైందంటే?

TDP: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మెుదలైంది. రెండు రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే వాడివేడిగా ప్రచారాలు మెుదలు పెట్టాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు
తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తానొక్కడినే ఈ పని చేయలేనని భావన ఆయనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందుకే ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారట.

 

ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలిగింది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన ఈ పార్టీ, సీనియర్ ఎన్టీఆర్ నేతృత్వంలో ఢిల్లీ కోటకు తమ సత్తాని చూపించింది. అనంతరం పార్టీ పగ్గాలను చంద్రబాబు నాయుడు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్ మెుదటి ముఖ్యమంత్రిగాను చంద్రబాబు పనిచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఏమంత బాగోలేదు. కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీని గెలిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయినట్లు తెలిసింది. పేదల పథకాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మరోసారి ఆ దిశ గా నడిపించాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణకు మాట ఇచ్చినట్లు తెలిసింది. కేవలం ఒక్క ఏపీలోనేకాక తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని తారక్ మాట చెప్పారట. ఇందులో భాగంగానే పథకాల క్రియేషన్ లో తన మార్క్ ని తారక్ చూపిస్తారని తెలుగు దేశం పార్టీ నాయకుల చెబుతున్నారు. పక్కాగా మార్కును చూపిస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు తెలుగు దేశం నేతలు.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -