Romance: సాధారణంగా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని పోలీసుల వద్దకు పరుగులు తీస్తారు.ముఖ్యంగా మహిళలకు ఏదైనా ఇబ్బంది తలెత్తిన తవపట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే పోలీసులను ఆశ్రయించి వారి బాధను పోలీసులకు చెబుతారు. అయితే ఆ పోలీసులే అలాగా ప్రవర్తిస్తే ఇక వారి బాధను ఎవరికి చెప్పుకోవాలి.ఇలా పోలీసులు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటన తాజాగా రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ ఉదయ్ పూర్ పరిధిలోని లసాడియా పోలీస్ స్టేషన్ లో లోకేష్ కుమార్, సురేంద్ర సింగ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఓ మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించారు. ఆ మహిళను గదిలోకి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రొమాన్స్ చేశారు అంతేకాకుండా ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించారు. అయితే గదిలో ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు ఒక లాయర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా ముగ్గురు కలిసి ఒకే మహిళతో రొమాన్స్ చేయడమే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు కానిస్టేబుల్ లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో చూసినటువంటి పలువురు నెటిజెన్స్ సొసైటీని కాపాడాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ఇక మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుంది అంటూ ఈ వీడియో పై అలాగే పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.