Priyamani: అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో డస్కీ బ్యూటీ ప్రియమణి ఒకరు. గ్లామరస్ పాత్రలతోపాటు ఫ్యామిలీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కెరీర్ పరంగా మంచి సినిమాల్లో నటిస్తూ.. ఎన్నో హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంది. ‘పెళ్లై కొత్తలో.., యమదొంగ’ వంటి సినిమాల్లో నటించారు. సినిమా సక్సెస్తో సంబంధం లేకుండా చాలా వరకు సినిమా చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రియమణి పెళ్లి చేసుకుంది. దాంతో కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైంది. చాలా రోజుల తర్వాత ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘ఫ్యామిలీ మెన్-2’ వెబ్సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు బుల్లితెర షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మంచిగా రాణిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ నటించిన నారప్ప సినిమాలో భార్య పాత్రలో నటించింది. విరాటపర్వం సినిమాలోనూ కీలక పాత్రలో నటించారు. కెరీర్ పరంగా మంచి పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అయింది. ప్రియమణికి పెళ్లై చాలా ఏళ్లైంది. ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. దీంతో ప్రస్తుతం పెళ్లై ఇన్నేళ్లయినా.. ఎందుకు పిల్లలను కనడం లేదనే విషయంపై ప్రచారం జరుగుతోంది. అయితే ప్రియమణి గర్భసంచి చాలా వీక్గా ఉందట. ఇప్పటికే ఆమె రెండు సార్లు గర్భం దాల్చినా.. గర్భసంచిని తట్టుకోలేక అబార్షన్ కూడా అయిందట. ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేసినా.. అదే జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారట. ఒకవేళ పిల్లలు కావాలని ప్రియమణి ట్రై చేస్తే.. ఆమె ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారని సమాచారం. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని ప్రియమణి భర్త ఆ నిందను తనపై వేసుకున్నాడట. ఇప్పట్లో పిల్లలు వద్దను చెబుతూ వస్తున్నాడట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.