Allu Arjun: బన్నీ అన్నయ్య మృతికి అసలు కారణమిదే?

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్న ఫ్యామిలీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ రాగా.. ఆయన తర్వాత అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’తో బిజీగా ఉంటే అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ పేరుతో సినిమా చేసి.. చాలాకాలం తర్వాత సక్సెస్ రుచి చూశారు.

 

 

తాజాగా అల్లు శిరీష్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాంకు వచ్చాడు. అక్కడ తనకు సంబంధించిన విషయాలతో పాటు అల్లు కుటుంబానికి సంబంధించిన పలు విషయాల గురించి వివరించాడు. ఈ మధ్యన రెండు, మూడు నెలలు ముంబైలో మకాం వేయడానికి కారణం.. కథల కోసమే వెళ్లినట్లు చెప్పాడు. అంతే కానీ అందరూ అనుకున్నట్లు అల్లు వారి ఇంటి కోడలి కోసం కాదని స్పష్టతనిచ్చాడు.

 

 

ఇక అలీ అల్లు శిరీష్ వ్యక్తిగత జీవిత విషయాలను అడుగుతూ.. ‘మీ నాన్న గారి ఎపిసోడ్ చూశావా? అందులో ఏం నచ్చింది’ అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ‘ఆయన వచ్చినప్పుడే దీని గురించి అడుగుదామని అనుకున్నా కానీ ఆయన ఎమోషనల్ అవుతాడేమో అని అడగలేదు. ఇంతకీ మీరు అన్నదమ్ములు ఎంతమంది’ అని అడుగుతాడు అలీ.

 

 

బన్నీ అన్నయ్య మృతికి అసలు కారణమిదే?

దానికి అల్లు శిరీష్ సమాధానమిస్తూ.. ‘మేము మొత్తం నలుగురు అబ్బాయిలం. పెద్దన్నయ్య వెంకటేష్, తర్వాత రాజేష్, ఆ తర్వాత అర్జున్, చివర్లో నేను. అయితే రాజేష్ నేను పుట్టకముందే చనిపోయాడు’ అని వివరించాడు. అల్లు అర్జున్ అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -