NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందుకే విదేశాలకు వెళ్లాడా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ లో లేడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అప్టేడ్స్ లేక బాధలో ఉన్నారు. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం గురించి సరైన అప్ డేట్ లేక నందమూరి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు.

 

టాలీవుడ్ లో అందరూ హీరోలు తమ తదుపరి చిత్రాల గురించి చెబుతూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. మరికొందరు సంక్రాంతి బరిలో నిలుస్తామంటూ తెగేసి చెబుతున్నారు. అయితే తారక్ మాత్రం మౌనంగా ఉండటం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ఎన్టీఆర్ మౌనం వెనక కొరటాల ఉన్నారంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆచార్య సినిమా విమర్శపాలు కావడంతో కొరటాల శివ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసినా కూడా తదుపరి విషయాలనేమీ వెల్లడించలేదు. దీంతో కొరటాలకు ఎన్టీఆర్ లక్కీ ఛాన్స్ ఇస్తే దానిని ఉపయోగించుకోవడం లేదంటూ తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆచార్య సినిమా తర్వాత కొరటాల ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా రెడీ చేయలేదంటూ నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

డిసెంబర్ రెండో వారంలో ఎన్టీఆర్ 30వ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ నిన్న విదేశాలకు బయల్దేరి వెళ్లిపోయారు. న్యూ ఇయర వరకూ ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. తారక్ చెప్పిన విధంగా కొరటాల స్క్రిప్ట్ లో చేంజెస్ చేయకపోవడం వల్లే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లాడని నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ బద్దకంగా పనిచేస్తున్నారని, ఎన్టీఆర్ లక్కీ ఛాన్స్ ఇస్తే వినియోగించుకోకుండా అంధకారంలోకి వెళ్లిపోయారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -