Balayya: ఆ భయం వల్లే బాలయ్య మల్టీస్టారర్స్ లో నటించరా?

Balayya: టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు, దర్శకులు మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన బాలయ్య మాత్రం సింగిల్ గానే సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నారు. సీనియర్ స్టార్ హీరోలంతా మల్టీ స్టార్ సినిమాలు చేస్తుంటే బాలయ్య మాత్రం దానికి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో బాలయ్య ఒకటీ రెండు మల్టీ సార్టర్స్ సినిమాలో నటించారు. అయితే అవి అంతగా ఆడలేదు. మల్టీ స్టారర్ సినిమా సక్సెస్ సాధించినా అందులో మెయిన్ హీరోకు క్రెడిట్ మాత్రం దక్కదని తెలుస్తోంది.

 

బాలయ్యను కూడా ఈ రీజన్ వల్లే మల్టీ స్టారర్ సినిమా దూరంగా ఉంటున్నారని సమాచారం. ఇక రానున్న రోజుల్లో ఓ మంచి కథ ఉంటే తాను మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు సిద్దమని బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే బాలయ్య మాత్రం ఆసక్తి చూపడనే తెలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సోలో హీారోగానే చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. అనిల్ రావివూడి, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో ఆయన సింగిల్ గానే చేస్తున్నారు.

 

ప్రస్తుతం రూ.110 కోట్ల బడ్జెట్ తో వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే ఉంది. బాలయ్య నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో అలాంటి వాటినే బాలయ్య ప్రేక్షకులకు అందిస్తూ విజయాలు సాధిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది.

 

మరోవైపు బాలయ్య అనిల్ కాంబో మూవీ షూట్ మొదలైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇంకా స్పష్టత రావాలి. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. పంచ్ డైలాగులతో, అదిరిపోయే లుక్స్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇందులో అటు కామెడీ, ఇటు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -