NTR: ఎవరూ ఎంతటి విజయం సాధించినా దాన్ని సరైన పద్ధతిలో ప్రొజెక్టు చేసుకోకపోతే, పబ్లిషిటీ రాదు. ఏ రంగంలోనైనా తను సాధించిన విజయాల్ని తప్పకుండా చెప్పుకోవాలి. తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్రెడిట్ ను పబ్లిసిటీ రూపంలో క్యాష్ చేసుకోవడంలో హీరో రామ్ చరణ్ చాలా ముందుకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ మాత్రం బాగా అంటే బాగా వెనుకబడిపోయారు.
హైదరాబాద్ నుంచి ముంబయి, ఢిల్లీ మీదుగా అమెరికా వరకు రామ్ చరణ్ హడావుడి మామూలుగా లేదు.కానీ ఎన్టీఆర్ మాత్రం ఏ హడావుడి లేకుండా అలా వున్నారు. కొత్త సినిమా అప్ డేట్ అడిగితే సినిమా ఆపేస్తా అంటూ అభిమానులతో సరదాగా జోక్ కట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు కూడా పబ్లిసిటీకి అవకాశం వుండే ఆఫర్లు వస్తున్నాయట. కానీ స్ట్రిక్ట్ గా ఒక్కటే చెబుతున్నారని తెలుస్తోంది.పర్సంట్ కూడా పొలిటికల్ టచ్ ఎక్కడా కిలో మీటర్ దూరంలో కూడా కనపడకూడదట. అలా అయితేనే ఓకే అంటారట.
కొన్నాళ్ల క్రితం అమిత్ షా ను కలిసినపుడు సోషల్ మీడియాలో నానా హడావుడి జరిగింది. ఇకపై అస్సలు పొలిటికల్ టచ్ అన్నది తనకు సమీప భవిష్యత్ లో వద్దని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. ఓ నేషనల్ ఛానెల్ ఎన్టీఆర్ ను ఓ కార్యక్రమానికి ఆహ్వానిస్తే, దానికి ఓ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ వుందని తెలిసి నో చెప్పారట. అలాగే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసే సూచన వచ్చినా వద్దని చెప్పారట.
మొత్తానికి ఇవన్నీ టీడీపీ బంధాలు ఎన్టీఆర్ కుటుంబానికి వుండడం వల్లనే అనుకోవాలి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విషయంలో మౌనంగా వున్నారు.అందుకే అదే బంధాలతో చాలా పనులు వద్దనుకుంటున్నారు అని తెలుస్తోంది.