Veera Simha Reddy: వీరసింహాతో బాలయ్య రూ.300 కోట్ల కల నిజమవుతుందా?

Veera Simha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండరీ యాక్టర్లు ఉన్నారు. ఎంతోమంది ఇంకా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ట్యాలెంట్ ఉన్న వారిని అందలం ఎక్కించే టాలీవుడ్ లో.. తన నటన, డైలాగులు, మాస్ ఫాలోయింగ్ తో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న హీరో నందమూరి బాలయ్య. నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

 

మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు దగ్గరగా సినిమాలు చేసే నందమూరి బాలయ్య.. ఇప్పుడు తన కెరీర్ లో రెండో ఇన్సింగ్స్ ని ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఓటీటీలో రియాల్టీ షో చేస్తూ సక్సెస్ అందుకున్నాడు. అదే సమయంలో యాడ్స్ చేస్తూ కూడా ప్రేక్షకుల దగ్గరవడంతో పాటు ఆర్థికంగా కూడా మరింత బలపడుతున్నాడు.

 

బాక్సాఫీస్ ముందు బాలయ్య బాబు సినిమా వస్తుందంటే ఆ హుషారే వేరుగా ఉంటుంది. బాలయ్య బాబు మాస్ డైలాగులు, ఫైట్లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంటాయి. అయితే బాలయ్య బాబు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో రికార్డులను, అవార్డులను అందుకోగా.. ఓ రికార్డ్ కోసం చాలాకాలంగా ఆయన పరితపిస్తున్నాడు. కలెక్షన్ల విషయంలో ఎంతో కాలంగా కోరికగా మిగిలిపోయిన తన కలను ఈ సంక్రాంతికి తీర్చుకోబోతున్నాడా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో సాగుతోంది.

 

ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య, గోపిచంద్ మలినేనితో కలిసి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో తన 300 కోట్ల కలెక్షన్ల కలను బాలయ్య సొంతం చేసుకుంటాడనే టాక్ నడుస్తోంది. గతంలో వచ్చిన ‘అఖండ’ కన్నా మంచి ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు రావడంతో పాటు సంక్రాంతి బాలయ్యకు కలిసి వస్తుందనే సెంటిమెంట్ నేపథ్యంలో బాలయ్య.. 300 కోట్ల కలెక్షన్లను వీరసింహారెడ్డి సినిమా సాధించిపెడుతుందనే గట్టి నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -