Geetu Royal: బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ఒక్కోక్కరూ ఒక్కో రకంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 నుంచి కంటెస్టెంట్ గీతు రాయల్ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్6 ద్వారా ఆమెకు మంచి పాపులారిటీ దక్కిందని చెప్పాలి. గీతు రాయల్ చిత్తూరు యాసలో హుందాగా మాట్లాడుతూ రాయలసీమ బిడ్డగా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలపై రివ్యూయర్ గా ఆమె నెట్టింట మంచి క్రేజ్ ను తెచ్చుకుంది.
అందుకే ఆమెకి బిగ్బాస్ షోకు వెళ్లే అవకాశం దక్కిందనే చెప్పాలి. ఈ తరుణంలో బిగ్బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది. హౌస్ నుంచి బయటికొచ్చే క్రమంలో తాను ఏడ్వడంతో పాటు ప్రేక్షకుల్ని కూడా గీతు రాయల్ కంటతడిని తెప్పించింది. గీతు రాయల్ కు చిత్తూరు చిరుతగా మంచి పేరుంది. తన మనసులో ఏదీ దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడే నైజం గీతు రాయల్ సొంతం అనే చెప్పాలి. అందుకే ఆమె బిగ్ బాస్ షో ఎంతో గుర్తింపును ఇచ్చింది.
తాజాగా గీతూ రాయల్ రాజకీయాల్లోకి రావాలనే తన మనసులో మాటను వెల్లడించింది. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గీతు రాయల్ మీడియాలో మాట్లాడింది. ప్రజాసేవ చేయడం కోసం త్వరలో రాజకీయాల్లోకి తాను వెళ్తున్నట్లుగా ఆమె తెలిపింది. అయితే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఏ పార్టీలోకి వెళ్లాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని, ఇంకా ఏ పార్టీలో చేరాలో స్పష్టంగా అనుకోలేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం తాను రాజకీయాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
తనకు పదవులపై కోరిక లేదని, రూలర్ కావాలనే తన బలమైన కోరికను బిగ్ బాస్ హౌస్ లో కూడా పదే పదే చెప్పినట్లుగా ఆమె వెల్లడించారు. అయితే రాజకీయాల్లోకి రావడానికి తనకు ఏది మంచి వేదికో నిర్ణయించుకుని తెలియజేస్తానని గీతు రాయల్ తెలిపింది.