Hyderabad: రోజురోజుకు సమాజం ఎలా మారుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకు, మహిళలకు ఈ భూమిపై రక్షణ లేకుండా పోతుంది. బయట మృగాలే కాకుండా ఇంట్లో కన్న తండ్రి రూపంలో ఉండే మృగాల నుండి కూడా రక్షణ లేకుండా పోయింది. పిల్లలను కాపాడే బాధ్యత తల్లిదండ్రులదే.. కానీ ఆ తల్లిదండ్రులే పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఇటీవలే ఒక నీచుడు కన్న కూతురిని కూడా చూడకుండా అత్యాచారం చేశాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక కుటుంబం హైదరాబాదులో ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. ఇక ఆ భార్యాభర్తలిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇక భర్త వాచ్మెన్ గా పనిచేస్తే.. భార్య పని మంచిగా చేస్తుంది.
ఇక కొడుకు హాస్టల్లోనే చదువుకుంటున్నాడు. కూతురు మాత్రం తమ వద్దనే పెరుగుతుంది. ఇక ఆ కూతురు వయసు 14 ఏళ్ళు. అయితే తల్లి పని కోసం అని బయటికి వెళ్ళగా ఆ తండ్రి కూతురు తినే భోజనంలో మత్తు మాత్రలు పెట్టడంతో అవి తిని ఆ కూతురు చనిపోగా.. ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు ఆ నీచుడు.
ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే పోలీసులు ఆ నీచుడిని అరెస్టు చేసి జీవిత ఖైదుగా శిక్ష విధించారు. ఇక ఈ ఘటన గురించి అందరికీ తెలియటంతో బయటనే కాకుండా ఇంట్లో కూడా బతకాలంటే ఆడపిల్లకు భయమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. తండ్రి అనే వాడు ఇంత నీచంగా ఉంటాడా అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. కూతుర్ని కాపాడాల్సిన వాడు కూతురి జీవితాన్ని నాశనం చేశాడు అంటూ.. ఆ నీచుడిని అస్సలు వదలకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.