Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ కాదు పన్నీరు సెల్వం.. రాజమౌళి కజిన్ సంచలన వ్యాఖ్యలు!

Ponniyin Selvan: తెలుగు సినీ ప్రియులకు తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు కోలీవుడ్ మీడియా, కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా బాహుబలిని మించి ఉంటుందని ఉబ్బి పోయారు. మరికొందరైతే బాహుబలా బొక్కా అన్నట్లు మాట్లాడారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు కూడా కౌంటర్ ఇచ్చారు. కొన్ని కోట్లు క్రాస్ చేసిన బాహుబలి సినిమాకు ఈ సినిమాకు పోలిక ఎక్కడైనా ఉందా అన్నట్లు దెప్పి పొడిచారు. ఇక ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు మణిరత్నం బాహుబలి సినిమాను కాపీ కొట్టాడు అని అంటున్నారు.

ఈ సినిమాలో పలు సన్నివేశాలు బాహుబలి ని పోలి ఉన్నట్లు అనిపిస్తున్నాయి అని తెలియజేశారు. ఇక పాత్రల విషయంలో కూడా బాహుబలిని పోలి ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సహ రచయిత రాజమౌళి కజిన్ అయినటువంటి కాంచీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు. ప్రస్తుతం కాంచీ చేసిన ఈ ట్వీట్ పొన్నియన్ సెల్వన్ మూవీ ను కించపరిచే విధంగా మారింది.

ఇంతకు కాంచీ చేసిన ఆ ట్వీట్ ఏమిటంటే పొన్నియన్ సెల్వన్ సినిమాను పన్నీరు సెల్వం అంటూ ట్వీట్ చేసాడు. ఇతడు ఇలా చేయడానికి కారణం గతంలో కోలీవుడ్ ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ విషయంలో బాహుబలి సినిమాను తీసి పారేసినట్టు మాట్లాడారు. దానికి అసహనం వ్యక్తం చేసి కాంచీ ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇండస్ట్రీలో పెద్ద రచ్చని సృష్టించే విధంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -