Wyra: త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. ఉరేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ అలా?

Wyra: వైరా పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబం నివసిస్తోంది. ఒక తల్లికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. తల్లి కష్టాన్ని చూడలేక కూతుర్లు కొడుకు తల్లికి చేదోడువాదోడుగా ఉన్నారు. చిన్న కూతురు మిషన్ కుడుతుండగా పెద్ద కూతురు సాయి ప్రసన్న స్థానికంగా అయ్యప్ప స్వామి గుడిలో పడి చేసేది. ఇక కొడుకు విజయవాడలో ఒక గుమస్తాగా ఉద్యోగం చేసేవాడు. అలా వారి జీవితం ఎంత సాఫీగా సాగుతుంది. ఇటీవలే పెద్ద కూతురు సాయి ప్రసన్నకు పెళ్లి సంబంధం కుదరడంతో ఆ ఇంట్లో ఆనందం మొదలయ్యింది. కూతురు పెళ్లి చేసి ఒక బాధ్యత తీర్చుకుందాం అనుకున్న ఆ తల్లికి ఆ కూతురు ఇంతలోనే ఒక తీరని శోకాన్ని మిగిల్చింది.

 

వైరా పట్టణం 3వ వార్డు మున్సిపాలిటీకి చెందిన తాళ్లూరి చంద్రకళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. తన పెద్ద కూతురు సాయిప్రసన్న22 కు ఇటీవలే ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే మరికొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా నిశ్చయించుకున్నారు. ఇక ఎప్పటి లాగా తాజాగా సాయి అయ్యప్ప ఆలయంలో మధ్యాహ్నానం వరకు పనిచేసింది. ఆ తర్వాత తల్లి చంద్రకళ పనిచేసే కిరాణా షాప్ వద్దకు వచ్చి తల్లితో మాట్లాడి ఇంటికి వెళ్లింది. అయితే ఏం జరిందో ఏమో కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

 

దాంతో కొద్దిరోజుల్లో పెళ్లి కూతురుగా చూడాలి అనుకున్న సాయిప్రసన్నను ఇలా చూడటంతో తల్లి కన్నీరు మున్నీరు గా విలపించింది. అయితే మృతికి గల కారణం ఏంటి అనేది తెలియడం లేదు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన పెద్ద కూతురు తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కుతుంది అన్న ఆనందం ఆ తల్లికి కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. పెళ్లి పీటలపై చూడాల్సిన తన కూతుర్ని అలా ఫ్యానుకు ఊరు వేసుకొని వేలాడుతూ చూడడం చూసి ఆ తల్లి గుండెలు విలసేలా రోధిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -